Friday, May 17, 2024

పిల్లలకు టీకా.. వ్యాక్సిన్ పంపిణీపై ఎయిమ్స్ చీఫ్ కీలక వ్యాఖ్య

కరోనా థర్డ్ వేవ్‌లో పిల్లలకు ముప్పు ఉందన్న నిపుణుల హెచ్చరిక నేపథ్యంలో ఎయిమ్స్​ చీఫ్​ డాక్టర్ రణదీప్​ గులేరియా కీలక వ్యాఖ్యలు చేశారు. కొవిడ్​ టీకా వస్తే పాఠశాలలు పునఃప్రారంభించేందుకు మార్గం సుగమం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కొవిడ్ మహమ్మారి వల్ల ఏడాదిన్నరగా పిల్లలకు తమ చదువుల్లో తీరని నష్టం ఏర్పడిందన్నారు. పాఠశాలలను పునఃప్రారంభించటంలో చిన్నారులకు టీకా అందించే ప్రక్రియ.. అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుందని తెలిపారు. 2 నుంచి 18 ఏళ్ల లోపు వయస్సు వారి కోసం భారత్​ బయోటెక్​ సంస్థ అభివృద్ధి చేస్తున్న కొవాగ్జిన్​ టీకా.. రెండో, మూడో దశ క్లినికల్​ ట్రయల్స్​​ సమాచారం సెప్టెంబర్​ నాటికి వస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. భారత్​ బయోటెక్ కంటే ముందే ఫైజర్​ వ్యాక్సిన్​.. చిన్నారులు కోసం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. పిల్లలకు కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నా, అసలు లక్షణాలే లేకపోయినా కూడా వారి ద్వారా ఇతరులకు వైరస్​ వ్యాపించే ప్రమాదం ఉందని గులేరియా హెచ్చరించారు. కరోనా నుంచి బయటపడాలంటే టీకా ప్రక్రియను ముమ్మరం చేయాల్సిన అవసరం ఉందని గులేరియా పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: ఫ్యాక్ట్ చెక్: ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపు! నిజమేనా?

Advertisement

తాజా వార్తలు

Advertisement