రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ రాధే శ్యాం. యూవీ క్రియేషన్స్ సమర్పణలో తెరకెక్కతున్న ఈ సినిమాని రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు. భారీ బడ్జెట్ మూవీగా యూవీ క్రియేషన్స్, టీసిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా రాధేశ్యామ్ నుంచి హిందీ సెకండ్ సింగిల్ ‘సోచ్ లియా’ సాంగ్ టీజర్ రిలీజ్ చేశారు. ఈ పాటలో ప్రభాస్, పూజా హెగ్డేల మధ్య ఎమోషనల్ బాండ్ చూపించారు. డిసెంబర్ 8న ఫుల్ సాంగ్ ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదరు చూస్తున్నారు. సాహో సినిమా నిరాశ పర్చడంతో రాధేశ్యామ్ పై భారీ అంచనాలే పెట్టుకున్నారు. తెలుగు,హిందీతోపాటు దక్షిణాది బాషాల్లో సినిమా రిలీజ్ కానుంది. బాహుబలితో ఇండియాన్ స్టార్ గా మారిన ప్రభాస్.. తాజా సినిమా ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.