Saturday, May 4, 2024

ఆస‌క్తిక‌ర ట్వీట్ చేసిన ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త ‘ఆనంద్ మ‌హీంద్రా’

బాలీవుడ్ సాంగ్ మేరే స‌ప్ నోంకీ రాణీ క‌బ్ ఇప్ప‌టికీ, ఎప్ప‌టికీ ఎవ‌ర్ గ్రీనే. కాగా ఈ సాంగ్ పై ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త ఆనంద్ మ‌హీంద్రా ఆస‌క్తిక‌ర అంశాన్ని తెలిపాడు. సోష‌ల్ మీడియాలో ఆనంద్ మ‌హీంద్రా ఎంతో యాక్టీవ్ గా ఉంటార‌నే సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ లో 1969లో వచ్చిన ఆరాధన చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టయింది. అందులోనిదే ‘మేరే సప్నోంకీ రాణీ’ పాట.ఆ సినిమాలో హీరో మహీంద్రా జీపులో వెళుతుండగా, రైలులో హీరోయిన్ ప్రయాణిస్తుంటుంది. ఆమెను చూస్తూ హీరో తన ప్రేమను తెలిపే సమయంలో మేరే సప్నోంకీ రాణీ పాట పాడతాడు. 1969లో బాలీవుడ్ మొట్టమొదటి సూపర్ స్టార్ మహీంద్రా ఎస్ యూవీలో కూర్చునే తన ప్రేయసి కోసం ‘మేరీ సప్నోంకీ రాణీ కబ్ ఆయేగీ తూ’ అని పాడాడు. దాదాపు అర్ధశతాబ్దం తర్వాత అదే ఎస్ యూవీ కొత్త అవతారం దాల్చింది. ఆనాటి ప్రణయం ఇంకా నిలిచే ఉంది” అంటూ ట్వీట్ చేశారు. కొత్త థార్ వాహనం తాలూకు యాడ్ ను కూడా పంచుకున్నారు. అప్పట్లో వచ్చిన ఆరాధన చిత్రంలో రాజేశ్ ఖన్నా, షర్మిలా టాగోర్ నటించారు. హిందీ చిత్రసీమలో సూపర్ స్టార్ బిరుదు పొందిన మొదటి హీరో రాజేశ్ ఖన్నానే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement