Monday, May 6, 2024

అదృష్టం అంటే ఈమెదే..స‌ర‌దాగా లాట‌రీ టిక్కెట్ కొంటే-రూ.40ల‌క్ష‌లు వ‌చ్చాయ్

ఒక్కోసారి మ‌నం ఊహించ‌న‌వి మ‌న లైఫ్ లో ఎన్నో జ‌రుగుతుంటాయి. అయితే ఓ మ‌హిళ‌కి ల‌క్క్ ల‌క్క‌పిడ‌త‌లా త‌గిలింది. పిజ్జా కొన‌డానికి వెళ్లి లాట‌రి టిక్కెట్ కొనింది. ఇంకేముంది ఆమె ఊహించ‌ని విధంగా రూ.40ల‌క్ష‌లు బ‌హుమ‌తిగా వ‌చ్చాయి. ఈ సంఘ‌ట‌న సౌత్ కరోలినాలో స్వాన్సియాలో చోటు చేసుకుంది..ఈ ప్రాంతానికి చెందిన ఓ మహిళ.. ఏదో పనిమీద బయటికి వెళ్లి సాయంత్రం ఇంటికి తిరుగుముఖం పట్టింది. ఫ్యామిలీ అంతా కలిసి తినేందుకు పిజ్జా తీసుకెళదామని భావించింది. స్వాన్సియాలోని రెయిన్ బో గ్యాస్ స్టేషన్ వద్ద రెస్టారెంటుకు వెళ్లి పిజ్జాలకు ఆర్డర్ చేసింది. పిజ్జాలు రెడీ అవడానికి కాస్త సమయం పడుతుందని చెప్పడంతో కాసేపు ఆ ఆవరణలో తచ్చాడటం మొదలుపెట్టింది.

అక్కడ సౌత్ కరొలినా ఎడ్యుకేషన్ లాటరీకి సంబంధించి టికెట్లను విక్రయించడం చూసింది. ఏదో సరదాకి ప్రయత్నిద్దామని రెండు డాలర్లు పెట్టి జంబో బక్స్ టికెట్లు కొనుగోలు చేసింది. అవి స్క్రాచ్ కార్డు టైప్ టికెట్లు. ముందుగానే లాటరీ ప్రైజ్ వచ్చే నంబర్లు ఎంపికై ఉంటాయి. టికెట్లను అప్పటికప్పుడు స్క్రాచ్ చేసి చూసుకుని.. ఆ నంబర్ ఉంటే బహుమతి తీసేసుకోవచ్చన్న మాట. అయితే సదరు మహిళ అప్పటికప్పుడే టికెట్లను స్క్రాచ్ చేయలేదు. పిజ్జాలు తీసుకుని ఇంటికి వెళ్లిపోయింది. ఫ్యామిలీ అంతా కలిసి డిన్నర్ చేశాక.. టికెట్లను స్క్రాచ్ చేశారు. అందులో నంబర్లను, బహుమతి వచ్చే నంబర్లను సరిచూసుకుని ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఎందుకంటే ఆ టికెట్ కు సుమారు రూ.40 లక్షలు (50 వేల డాలర్లు) లాటరీ తగలిగింది. మొదట తన కుటుంబ సభ్యులు లాటరీ తగిలిందంటే నమ్మలేదని.. నంబర్లను ఒకటికి రెండుసార్లు సరిచూసుకుని ఎగిరి గంతేశారని ఆమె వెల్ల‌డించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement