Monday, April 29, 2024

లారీ.. ప్రైవేటు బ‌స్సు ఢీ.. న‌లుగురు దుర్మ‌ర‌ణం

లారీ.. ప్రైవేటు బ‌స్సు ఢీ కొన్నాయి. ఈ ప్ర‌మాదంలో న‌లుగురు అక్క‌డిక‌క్క‌డే దుర్మ‌ర‌ణం చెందారు. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించారు. మృతదేహాలను పోస్టు మార్టానికి పంపించారు. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నందున మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. మహారాష్ట్రలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు-పుణె జాతీయ రహదారిపై పుణె సమీపంలోని నర్హె ఏరియాలో ఈ ప్ర‌మాదం చోటే చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement