Sunday, April 28, 2024

కరోనా కట్టడికి ఒక్కటే మార్గం.. మాజీ ఎంపీ కొండా కీలక సూచన!

తెలంగాణలో కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తోంది. రాష్ట్రంలో కరోనా కట్టడి చేయడానికి కఠిన నిర్ణయాలు తీసుకోవాలని చేవెళ్ల మాజీ ఎంపీ కొండావిశ్వేశర్ రెడ్డి అన్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న వేళ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలు చేయాలని కోరారు. అలాగే కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. జస్టిస్‌ కొండా మాధవరెడ్డి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో వికారాబాద్‌లోని మా శారద ఆస్పత్రికి ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేషన్‌ యంత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొండా కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా విజృంభిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కరోనా బాధితులకు ఆక్సిజన్‌ అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. జర్మనీ నుంచి 25 ఆక్సిజన్‌ యంత్రాలను తెప్పించామని తెలిపారు. ఇందులో 13 యంత్రాలను మా శారద ఆస్పత్రిలో అందుబాటులో ఉంచుతామని.. ఇక్కడ శిక్షణ పొందిన వైద్య సిబ్బందితో కరోనా బాధితులకు ఆక్సిజన్‌ అందిస్తామని చెప్పారు.

మరోవైపు విశ్వేశర్ రెడ్డి ఓ వీడియో విడుదల చేశారు. చైనీస్‌ ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్స్‌ సరిగా చేయడం లేదన్నారు. అదే తను చెప్పబోయే ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌ గాలి నుంచి వాయువులను పీల్చుకొని ఫిల్టర్‌ ద్వారా నైట్రోజన్‌, 98శాతం కచ్చితమైన ఆక్సిజన్‌ను వేరు చేసి నైట్రోజన్‌ను బయటకు పంపి ఆక్సిజన్‌ను పైపు ద్వారా అందించనున్నట్లు తెలిపారు. ఇటీవల సిలీండర్లు దొరకడం లేదని, ఒకవేళ దొరికినా తొందరగా అయిపోతుందన్నారు. జపాన్‌లో రూపొందించిన ఈ ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌ కరెంట్‌తో నడుస్తుందని పేర్కొన్నారు. దీనిని కరెంట్‌ పెడితే 30 రోజులు ఏకధాటిగా వాడుకోవచ్చని తెలిపారు.

ఇది కూడా చదవండి: తప్పకుండా రాజీనామా చేస్తా… కానీ ఇప్పుడు కాదు: ఈటల

Advertisement

తాజా వార్తలు

Advertisement