Tuesday, May 14, 2024

గోమూత్రం తాగండి….కరోనాను తరిమికొట్టండి

ప్రమాదకర కరోనా మహమ్మారిపై యావత్ భారత్ తోపాటు ప్రపంచం మొత్తం యుద్ధం చేస్తోంది. ముఖ్యంగా సెకండ్
వేవ్ తో ఈ మహమ్మారి భారత్ లో విజృంభిస్తున్నది. దీంతో దేశంలో లక్షలాది కేసులు నమోదవుతుండగా వేలాదిమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే కరోనా కట్టడి విషయంలో బీజేపీ నాయకులు చేస్తున్న అశాస్త్రీయ వాదనలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయి. కరోనా వ్యాప్తికి అడ్డుకట్టవేయాలంటే
ఆవు మూత్రం తాగాల్సిందే అంటున్నారు యూపీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేంద్రసింగ్. అయితే ఆవుమూత్రం కరోనాను కట్టడి చేస్తుందా? అన్న విషయంపై ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేనప్పటికీ.. సదరు బీజేపీ ఎమ్మెల్యే చేసిన గోమూత్రవ్యాఖ్యలు ఆయనను నవ్వులపాలౌస్తోంది.

ముఖ్యంగా నెటిజన్లు ఆయన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు. బల్లియా జిల్లా బైరియా ఎమ్మెల్యే అయిన సురేంద్రసింగ్.. కరోనాకు అడ్డుకట్ట వేయాలంటే ఆవు మూత్రం తాగాలంటూ ఒక వీడియోలో ప్రజలను కోరారు. ఆవు మూత్రాన్ని ఎంత మోతాదులో నీటిలో కలపాలి? ఎప్పుడు తాగాలి? అన్న విషయాలను ఆ వీడియోలో ఎమ్మెల్యే వివరించారు. అంతేకాదు ఆయన కూడా ఆవు మూత్రాన్ని తాగి చూపించారు. గోమూత్రం ద్వారానే కరోనా వ్యాప్తిని కట్టడి చేయగలమని చెప్పారు. రోజుకు 18గంటలు పనిచేస్తున్నప్పటికీ తాను ఇంత ఆరోగ్యంగా ఉండడానికి గల కారణం గోమూత్రమేనని సెలవిచ్చారు.

ఇది కేవలం కరోనాను మాత్రమే కాదనీ, పలు వ్యాధులను కూడా నయం చేస్తుందని చెప్పారు. అయితే బీజేపీ ఎమ్మెల్యే గోమూత్ర రహస్యంపై సామాజిక మాధ్యమాల్లో ఎవరికి తోచిన విధంగా వారు జోకులు పేలుస్తున్నారు. ఈ రహస్యం తెలియక శాస్త్రవేత్తలు తమ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నారు అని ఒకరు, రాష్ట్రంలో 28వేలకు పైగా కొత్తకేసులు.. 372కరోనా మర
ణాలు సంభవించిన వేళ మీ చిట్కా చాలా అద్భుతం అంటూ మరొకరు సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టారు. బీజేపీ ఎమ్మెల్యే అశాస్త్రీయ గోమూత్ర చిట్కాపై నిపుణులు, వైద్యులు సైతం అసహనం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement