Friday, April 26, 2024

లైవ్ షోలో.. సింగ‌ర్ పై కాల్పులు

గుర్తు తెలియ‌ని దుండ‌గులు భోజ్ పురి సింగ‌ర్ నిషా ఉపాధ్యాయ లైవ్ షో ఉండ‌గా ఆమెపై కాల్పులు జ‌రిపారు. ఈ ఘటనలో ఆమె ఎడమ కాలికి బుల్లెట్‌ గాయాలయ్యాయి. దీంతో హుటాహుటీనా పాట్నాలోని మాక్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. బీహార్‌లోని పాట్నాలో నిర్వహించిన లైవ్ షోలో ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. యజ్ఞం జరుగుతున్న సమయంలో కాల్పులు జరిగాయి. నిషా ఉపాధ్యాయ బీహార్‌కి చెందిన ప్రఖ్యాత గాయని. సరన్ జిల్లాలోని గౌర్ బసంత్‌ ఆమె స్వస్థలంకు చెందిన నిషా ఉపాధ్యాయ జానపద గాయకురాలు. అనేక సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రదర్శనలు ఇస్తూ ఉంటారు. లే లే ఆయే కోకా కోలా, నవకర్ మంత్ర, ధోలిదా ధోల్ రే వగడ్, హసి హసి జాన్ మారెలా లాంటి హిట్ సాంగ్స్‌తో నిషా ఉపాధ్యాయ పాలపులారిటీ సంపాదించుకున్నారు. నిషా ఉపాధ్యాయకి బుల్లెట్ తగలడంపై పోలీసులు స్పందింస్తూ.. ఈ సంఘటన గురించి మాకు సమాచారం అందింది. కానీ ఎవరూ ఫిర్యాదు చేయలేదు. కాల్పులు ఎవరు జరిపారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement