Thursday, April 25, 2024

ఈనెల 9నుంచి రెండో దశ గొర్రెల పంపిణీ .. మంత్రి తలసాని

ఈనెల 9నుంచి రెండో దశ గొర్రెల పంపిణీ ప్రారంభమవుతుంద‌ని తెలంగాణ పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్ర‌క‌టించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ… మత్స్యశాఖ ఆధ్వర్యంలో జూన్ 8, 9, 10 తేదీల్లో అన్ని జిల్లా కేంద్రాల్లో చేపల ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నామన్నారు.

సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం 2018 మార్చి నాటికి కోటి 28 లక్షల గొర్రెలను లబ్ధిదారులకు పంపిణీ చేసిందన్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ లో పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనుండగా, ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తెలంగాణ వ్యాప్తంగా ఆయా జిల్లాలు, నియోజకవర్గాల్లో గొర్రెల యూనిట్లను పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement