Thursday, May 2, 2024

ఆల‌స్యంగా రెండో టెస్ట్ మ్యాచ్

భారత్-న్యూజిలాండ్ మధ్య ఈరోజు ముంబైలోని వాంఖడే స్టేడియంలో రెండో టెస్టు ప్రారంభం కానుంది. అయితే ఈమ్యాచ్ ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా మైదానం తడిగా ఉండడంతో టాస్ ఆలస్యంగా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత మూడు రోజులుగా ముంబైలో కురుస్తున్న వర్షాలకు పిచ్, అవుట్ ఫీల్డ్ తడిగా మారడంతో అంపైర్లు మైదానాన్ని పరిశీలించారు. మ్యాచ్ ప్రారంభించేందుకు అనువుగా లేకపోవడంతో టాస్‌ను కాసేపు వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో రెండో టెస్ట్ కాస్త‌ ఆలస్యంగా ప్రారంభమ‌య్యే అవకాశ‌ముంది.
ఇదిలా ఉండ‌గా… కాన్పూరులో ఇరు జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు చివరి రోజు చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగి చివరికి డ్రాగా ముగిసింది. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా సిరీస్‌ను ఎగరేసుకుపోవాలని ఇరు జట్లు ప్రయత్నిస్తున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement