Thursday, May 2, 2024

Breaking: లాలూ హెల్త్ కండిష‌న్ బాగాలేదు..

ఆర్జేడీ నేత, బిహార్‌ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్ ఆరోగ్యం బాగాలేదు. దీంతో ఆయనను రాజేంద్రన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (రిమ్స్‌)లో చేర్పించారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ.. ప్రమాదం ఏమీ లేదని వైద్యులు పేర్కొన్నారు. దాణా కుంభకోణం కేసులో లాలూకు రాంచీ ప్రత్యేక సీబీఐ కోర్టు ఇవాళ ఐదేళ్ల జైలుశిక్ష, రూ.60లక్షల జరిమానా విధించిన విషయం తెలిసిందే. ఈ నెల 15న ఈ కేసులో దోషిగా తేల్చగా.. ఇవాళ శిక్ష ఖరారు చేసింది.

ఈ క్రమంలో ఆయన బ్లడ్‌ షుగర్‌, రక్తపోటు హెచ్చుతగ్గులున్నాయి. ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షించేందుకు రిమ్స్‌ ఏడుగురు వైద్యులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. లాలూ మూత్రపిండాలతో పాటు పలు వ్యాధులతో బాధపడుతున్నారు. ఆయనకు కిడ్నీల వ్యాధి స్టేజీ-4లో ఉండగా.. 20శాతం సామర్థ్యతో మాత్రమే పని చేస్తున్నాయి. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు డాక్టర్‌ విద్యాపతి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement