Sunday, May 19, 2024

యాదాద్రిలో శాస్త్రోక్తంగా లక్షపుష్పార్చన పూజలు

తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి శ్రీ లక్ష్మీనృసింహుడి సన్నిధిలో ఏకాదశి పర్వదినం సందర్భంగా లక్షపుష్పార్చన పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. విశేష పూజాపర్వాలు పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో ఘనంగా నిర్వహించారు. ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులను పట్టువస్త్రాలతో దివ్యమనోహరంగా అలంకరించి ఆచార్యులు ప్రత్యేక వేదికపై తీర్చిదిద్దారు. అర్చక బృందం, వేదపండితులు స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో వివిధ రకాల పూలతో లక్షపుష్పార్చన పూజలు సంప్రదాయరీతిలో వైభవంగా నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement