Saturday, May 4, 2024

కొవిడ్ మరణాలపై ప్రభుత్వం తప్పుడు నివేదికలు: మోదీకి కోమటిరెడ్డి లేఖ

తెలంగాణలో ప్రభుత్వం కోవిడ్ మరణాలను దాస్తోందటూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి. రాష్ట్రంలో కొవిడ్ కారణంగా వందలాదిమంది చనిపోతున్నారని, ఈ విషయాన్ని ప్రభుత్వం దాచిపెట్టి తప్పుడు నివేదికలు ఇస్తోందని ఆరోపిస్తూ లేఖలో రాశారు. అంతేకాదు ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్రగా విరుచుకుపడ్డారు కోమటిరెడ్డి వెంకట రెడ్డి. కేసీఆర్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కేంద్రానికి తప్పుడు సలహాలు ఇస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి ఉద్ధృతంగా ఉందని, కాబట్టి మూడు వారాలపాటు లాక్‌డౌన్ విధించాలని మోదీకి రాసిన ఆ లేఖలో కోమటిరెడ్డి కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement