Friday, May 3, 2024

గ్రీన్ హౌస్ ప్రాజెక్ట్ కి బాంబులు పేల్చి భూమి పూజ చేసిన – కిమ్ జాంగ్ ఉన్

ఓ భారీ గ్రీన్ హౌస్ ని ఏర్పాటు చేసి , దాంట్లో కూర‌గాయ‌లు పండించాల‌ని నిర్ణ‌యించారు ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్ జాంగ్ ఉన్. అందుకోసం పలు అంతర్జాతీయ కంపెనీలు, స్థానిక సంస్థల సహకారం తీసుకున్నారు. ఈ గ్రీన్ హౌస్ లో ఏడాది పొడవునా, వాతావరణంతో సంబంధం లేకుండా అనేక రకాల కూరగాయలు, ఆకు కూరలు పండించవచ్చు.కిమ్ ఏది చేసినా అది ఆర్భాటంగా ఉండాల్సిందే.. అందుకే, ఈ గ్రీన్ హౌస్ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో బాంబులతో పేల్చి భూమిపూజ చేశారు. స్వయంగా పార చేతబట్టి మట్టిని ఎగదోశారు. గతంతో పోల్చితే చాలా బరువు తగ్గిన కిమ్… ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా కనిపించారు. అధికారులను ప్రోత్సహిస్తూ, అభినందన పూర్వకంగా చప్పుట్లు కొడుతూ ఉల్లాసంగా గడిపారు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో సందడి చేస్తోంది. ఉత్తర కొరియాలో శీతాకాలం వచ్చిందంటే కూరగాయల కొరత తీవ్రతరం అవుతుంది. శీతాకాలంలో అక్కడ అత్యధిక స్థాయిలో మంచుకురుస్తుంది. వ్యవసాయ పనులేవీ ముందుకు సాగవు. దాంతో, చలికాలం ముగిసేవరకు అక్కడి ప్రజలకు పచ్చళ్లు, ఎండబెట్టిన కూరగాయలే దిక్కు. అయితే, ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ దీనికి ఓ పరిష్కారం చూపాలని ఈ విధంగా సంక‌ల్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement