Tuesday, May 21, 2024

NIA: కర్ణాటకలో పీఎఫ్‌ఐ కీలక నేత అరెస్టు

బెంగళూరు: కర్ణాకటలో పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ) కీలక నేత మహ్మద్‌ యూనస్‌ను ఎన్‌ఐఏ అధికారులు అరెస్టు చేశారు. నిజామాబాద్‌ కుట్ర కేసులో యూనస్‌ నిందితుడిగా ఉన్నాడు. పీఎఫ్‌ఐలో ఆయుధ శిక్షకుడిగా వ్యవహరించిన యూనస్‌, తెలుగు రాష్ట్రాల్లో పీఎఫ్‌ఐ సభ్యులకు ఆయుధ శిక్షణ ఇచ్చినట్లు ఎన్‌ఐఏ అధికారులు గుర్తించారు. గతంలో నంద్యాల కేంద్రంగా కార్యకలాపాలు జరిపిన యూనస్‌, 2022లో ఎన్‌ఐఏ సోదాలు సమయంలో కర్ణాటకలోని బళ్లారికి పారిపోయాడు. అక్కడ బషీర్‌గా పేరు మార్చుకుని, షేక్‌ ఇలియాస్‌ అనే మరో వ్యక్తితో కలిసి పీఎఫ్‌ఐ సభ్యులకు ఆయుధ శిక్షణ ఇచ్చాడు. ప్రస్తుతం మహ్మద్‌ యూనస్‌ను అరెస్ట్ చేయగా, ఇలియాస్‌ పరారీలో ఉన్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement