Friday, April 26, 2024

CM KCR: నేడు మంచిర్యాలలో కేసీఆర్ పర్యటన

దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్ ఇవాళ మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ క్ర‌మంలోనే సీఎం ఒకరోజు పర్యటనకు మంచిర్యాల జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఈ పర్యటనలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ), బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.

చెన్నూరు ఎత్తిపోతల పథకం, ప్రభుత్వ వైద్య కళాశాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. వివిధ వెనుకబడిన వర్గాలకు చెందిన చేతివృత్తుల వారికి లక్ష రూపాయల ఆర్థిక సహాయ పథకాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. రెండో విడత గొర్రెల పంపిణీ, గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభించడంతో పాటు బహిరంగ సభలో ప్రసంగిస్తారని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement