Sunday, May 5, 2024

‘ఉద్ధ‌వ్ ఠాక్రే’తో భేటీ అయిన ‘కేసీఆర్’

తెలంగాణ సీఎం కేసీఆర్ , మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ ఠాక్రేతో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా భ‌విష్య‌త్ రాజ‌కీయాలు, ప్ర‌స్తుత రాజ‌కీయాల‌తో పాటు కేంద్ర ప్ర‌భుత్వ విధానాల‌పై చ‌ర్చిస్తున్నారు. కాగా మ‌ధ్యాహ్నం లంచ్ స‌మ‌యం ముగిసిన త‌ర్వాత వీరు భేటీ అయ్యారు. . ఈ స‌మావేశం ముగిసిన త‌ర్వాత ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ను.. కేసీఆర్ క‌ల‌వ‌నున్నారు. అనంత‌రం సాయంత్రం 7.20 గంటలకు సీఎం కేసీఆర్‌ ముంబై నుంచి హైదరాబాద్‌కు రానున్నారు. కేసీఆర్ వెంట‌ ఎంపీలు సంతోష్‌ కుమార్‌, రంజిత్‌ రెడ్డి, బీబీ పాటిల్‌, ఎమ్మెల్సీలు కవిత, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్ రెడ్డి ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement