Monday, May 6, 2024

Big Breaking | షోలాపూర్​లోని పంఢరిపూర్​ను సందర్శించనున్న సీఎం కేసీఆర్​..

బీఆర్​ఎస్​ అధినేత, తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర్ రావు.. ఆయన మంత్రివర్గం సభ్యులు ఆషాఢ ఏకాదశికి రెండు రోజుల ముందు (జూన్ 27) విఠల్ రుక్మిణి మందిర్‌లో ప్రార్థనలు చేయనున్నారు. మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయ పంఢర్‌పూర్‌ను వారు సందర్శించనున్నట్టు తెలుస్తోంది.

సంత్ జ్ఞానేశ్వర్, సంత్ తుకారాం పల్లకీలకు పూలమాలలు వేసి నివాళులర్పించనున్న భారత రాష్ట్ర సమితి మహారాష్ట్ర ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే శంకర్ అన్నా ధోంగే ఇవ్వాల (శుక్రవారం) తెలిపారు. తెలంగాణ నుంచి అనేక మంది భక్తులు పంఢర్‌పూర్‌కు కాలినడకన తీర్థయాత్రలు చేస్తారని ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement