Saturday, April 27, 2024

ఇవ్వాల చండీగఢ్‌కు వెళ్ల‌నున్న‌ కేసీఆర్‌.. రైతు కుటుంబాల ప‌రామ‌ర్శ‌లో సీఎం

ఉత్తరాది రాష్ట్రాల పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ ఇవ్వాల చండీగఢ్‌కు వెళ్లనున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన మూడు చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ ఏడాదిపాటు చేప‌ట్టిన‌ ఉద్యమంలో అమరులైన రైతు కుటుంబాలను ప‌రామ‌ర్శించ‌నున్నారు. ఢిల్లీ, పంజాబ్ సీఎంల‌తో కలిసి వారికి ఆర్థిక సహాయం అందించనున్నారు. అయితే.. ఆదివారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్‌ ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ నివాసానికి వెళ్లనున్నారు. మధ్యాహ్న భోజనం తర్వాత ఇరువురు నేతలు చండీగఢ్ వెళ‌తారు. ఇక‌.. ఈ సందర్భంగా ఉద్యమంలో ప్రణాలర్పించిన సుమారు 600 మంది రైతు కుటుంబాలను సీఎం కేసీఆర్ పరామర్శిస్తారు. వారికి ఆర్థికసాయంగా ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున చెక్కులను పంపిణీ చేస్తారు. అనంతరం ఢిల్లీ చేరుకుంటారు.

జాతీయ పర్యటనలో భాగంగా ఈ నెల 26న సీఎం కేసీఆర్‌ బెంగళూరులో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మాజీ భారత ప్రధాని దేవెగౌడ, కర్నాటక మాజీ సీఎం కుమారస్వామితో భేటీ అవుతారు. మే 27న గుజరాత్‌లోని రాలేగావ్ సిద్ది పర్యటనకు వెళ్తారు. అక్కడ ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేతో భేటీ అవుతారు. ఈనెల 29 లేదా 30వ తేదీన బెంగాల్, బిహార్ రాష్ట్రాల పర్యటన ఉంది. గల్వాన్ లోయలో వీరమరణం పొందిన భారత సైనిక కుటుంబాలను సీఎం కేసీఆర్‌ పరామర్శిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement