Thursday, April 25, 2024

ఐకేపీ సెంటర్ వద్ద వడ్ల బస్తాలు మాయం.. త‌ర‌లించ‌డంలో అధికారుల నిర్ల‌క్ష్యం

తరిగొప్పుల, (ప్రభ న్యూస్) : జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలోని ఐకేపీ సెంటర్ వద్ద తూకం (కాంటా) వేసిన వ‌డ్ల‌ బస్తాలు మాయమ‌య్యాయి. మండలంలోని బొంతగట్టు నాగారంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. రైతు ఈరుమల్ల జంపులు తెలిపిన వివరాల ప్రకారం.. తనకున్న రెండు ఎకరాల పైచిలుకు పొలంలో 178 బస్తాల ధాన్యాన్ని తీసుకువచ్చి ఐకేపీ సెంటర్ వద్ద ఆరబోశారు. నిన్న (శనివారం) కాంటా నిర్వహించారు. లారీలు అందుబాటులో లేకపోవడంతో బస్తాలు మొత్తం అక్కడే నిల్వ చేశారు.

అయితే.. ఆదివారం ఉదయం రైతు బస్తాల దగ్గరకు వెళ్లేసరికి 54 బస్తాలు క‌నిపించ‌లేదు. దీంతో గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని బోరున విలపించాడు. సకాలంలో తూకం వేసిన వ‌డ్ల‌ బస్తాలు తరలించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారని, సకాలంలో తరలిస్తే త‌న‌కు ఇలా జరిగేది కాదని వాపోయాడు. దీనికి పూర్తి బాధ్యత అధికారులు, ప్రభుత్వం భరించాలని కోరాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement