Wednesday, May 1, 2024

క‌న్న‌డ సీనియ‌ర్ న‌టుడు ‘రాజేశ్’ క‌న్నుమూత‌

క‌న్న‌డ సీనియ‌ర్ న‌టుడు రాజేశ్ క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌సు 89సంవ‌త్స‌రాలు. వయసు సంబంధిత సమస్యల కారణంగా ఆసుపత్రిలో ఆయన కన్నుమూశారు. ఫిబ్రవరి 9వ తేదీ నుంచి ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిన్న ఆయన పరిస్థితి మరింత క్షీణించింది. డాక్టర్లు అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆయనను బతికించలేకపోయారు. రాత్రి 2.30 గంటల ప్రాంతంలో ఆయన తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన భౌతికకాయాన్ని బెంగళూరులోని విద్యారణ్యపురలోని నివాసంలో అభిమానుల సందర్శనార్థం ఉంచారు. ఈ సాయంత్రం అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement