Friday, May 3, 2024

Bharath jodo: రాహుల్​ పాదయాత్రలో జాగింగ్​.. పరుగులుతీస్తున్న కాంగ్రెస్​ క్యాడర్​!

తమిళనాడులో నెల రోజుల క్రితం ప్రారంభమైన ‘‘భారత్ జోడో’’ యాత్ర ప్రస్తుతం బీజేపీ పాలిత కర్నాటకలోని చిత్రదుర్గ మీదుగా సాగుతోంది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పాదయాత్రలో ఇవ్వాల (సోమవారం) కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ పాల్గొన్నారు.

శివకుమార్ చేతిలో త్రివర్ణ పతాకంతో రాహుల్​ గాంధీ పక్కన జాగింగ్ చేస్తున్నట్లుగా పరుగెడుతున్న వీడియో ఒకటి ఇప్పుడు వైరల్​గా మారింది.​ దీన్ని డీకే తన​ ట్విట్టర్​లో షేర్​​ చేశారు. ‘‘కొన్నిరోజులు మీరు నడుస్తారు.. ఇంకొన్నిరోజులు మీరు పరుగెత్తుతారు! కలల వెంటపడటానికి మీరు ఈ రెండింటినీ చేయవలసి ఉంటుంది” అని డీకే శివకుమార్ తన ట్వీట్​లో రాశారు. ఇక.. మాండ్యా పాదయాత్రలో అనేక సరికొత్త దృశ్యాలు కనిపించాయి. రాహుల్ గాంధీ తన తల్లి షూలేస్‌లు కట్టి, సోనియా గాంధీని పాదయాత్రలో చేర్చుకోవడం కూడా వాటిలో ఒకటిగా చెప్పుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement