Thursday, May 2, 2024

Jio Paln: జియో మరో సంచలనం.. రూపాయికే 100 ఎంబీ డేటా

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో.. తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఇటీవలే జియో టారిఫ్ లను భారీగా పెంచిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా తన కస్టమర్లకు స్వల్ప ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. 100 ఎంబీ డేటాను 1 రూపాయికి అందిస్తున్నట్టు జియో ప్రకటించింది. జియో 1 జీబీ డేటాను రూ.15కి అందిస్తోంది. అయితే, తాజా రూపాయికే 100 ఎంబీ డేటాను అందిస్తున్నట్లు పేర్కొంది. అంటే 1 జీబీ డేటా 10 రూపాయలకు వస్తుందన్నమాట. అంతేకాదు 28 రోజుల వాలిడిటీని 30 రోజులకు పెంచుతున్నట్టు జియో ప్రకటించింది. జియో తీసుకున్న తాజా నిర్ణయం ఇతర టెలికాం కంపెనీలకు షాక్ ఇచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement