Sunday, April 28, 2024

జ‌య‌మ్మ పంచాయితీ ప్రీ రిలీజ్ ఈవెంట్ – అతిథులుగా నాగార్జున‌, నాని

జ‌య‌మ్మ పంచాయితీ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈ నెల 30న నిర్వ‌హించ‌నున్నారు..ఈ చిత్రంలో స్టార్ యాంక‌ర్ సుమ ప్ర‌ధాన‌పాత్ర‌ని పోషిస్తున్నారు. వెన్నెల క్రియేషన్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి విజయ్ కలివరపు దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని అందించడం విశేషం. ఇంతవరకూ ఈ సినిమా నుంచి వచ్చిన పాటలకు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. మే 6వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 30వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ .. దసపల్లా హోటల్లో నిర్వహించనున్నారు. రేపు సాయంత్రం 6 గంటల నుంచి ఈ కార్యక్రమం మొదలవుతుంది. ఈ సినిమాకి ముఖ్య అతిథులుగా నాగార్జున .. నాని వస్తున్నట్టుగా చెబుతూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement