Monday, April 29, 2024

జర్నలిస్టు సంజనాతో గోవాలో పెళ్లి.. ఫోటోలు వైరల్

టీమిండియా పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా ఓ ఇంటివాడయ్యాడు. స్పోర్ట్స్ యాంకర్ సంజనా గణేషన్ మెడలో మూడు ముళ్లు వేశాడు. ఇరువురు కుటుంబ సభ్యులు, పలువురు అతిథుల మధ్య వీరి పెళ్లి వేడుక గోవాలో ఘనంగా జరిగింది. ఈ నేపథ్యంలో తన పెళ్లి ఫోటోను బుమ్రా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తాను కొత్త ప్రయాణాన్ని మొదలుపెడుతున్నట్లు పోస్ట్ చేశాడు. కాగా బుమ్రా-సంజనా గణేషన్ జంటకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. త్వరలోనే భారత క్రికెటర్లతో పాటు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులకు బుమ్రా ప్రత్యేకంగా విందు ఇవ్వనున్నట్లు సమాచారం తెలుస్తోంది. పెళ్లి కారణంగా ఇప్పటికే టీ20 సిరీస్‌కు దూరమైన అతడు భారత్-ఇంగ్లండ్ మధ్య మార్చి 23 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభంకానుండగా.. ఈ సిరీస్‌లోనూ బుమ్రా ఆడటంపై సందేహాలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement