Sunday, April 28, 2024

Jammu Kashmir : సైన్యం కాల్పుల్లో ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు హ‌తం

శ్రీన‌గ‌ర్ : భార‌త భ‌ద్ర‌తా బ‌ల‌గాలు జ‌మ్మూక‌శ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఇద్ద‌రు ఉగ్ర‌వాదుల‌ను మట్టుబెట్టాయి. మ‌చిల్ ఏరియాలో ఉగ్ర‌వాదులు సంచ‌రిస్తున్న‌ట్లు భార‌త సైన్యానికి ప‌క్కా స‌మాచారం అందింది. దీంతో ఆ ఏరియాలో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు ఈరోజు కూంబింగ్ చేప‌ట్టాయి. దీంతో తార‌స‌ప‌డ్డ ఇద్ద‌రు ఉగ్ర‌వాదుల‌ను సైన్యం కాల్చి చంపింది. ఆ ప్రాంతంలో కూంబింగ్ ప్ర‌క్రియ కొన‌సాగుతోంద‌ని పోలీసులు తెలిపారు. ముందస్తు జాగ్ర‌త్త‌గా ఆ ప్రాంతంలో స్కూళ్ల‌ను మూసివేశారు. ఈ నెల మొద‌ట్లో రాజౌరి జిల్లాలో ఓ ఉగ్ర‌వాదిని బ‌ల‌గాలు మ‌ట్టుబెట్టిన సంగ‌తి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement