Friday, May 17, 2024

అధిక ఉష్ణోగ్ర‌త‌లు..ఆక్సిజ‌న్ అంద‌క మృతి చెందిన చేప‌లు

ఈ ఏడాది అధిక ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యాయి. ఈ ఎండల ధాటికి మనుషులే కన్నుమూస్తున్నారు..అలాంటిది చిన్న చిన్న జీవుల సంగతి ఏంటీ అనేది ప్రశ్నార్థకంగా మారింది. కాగా ఈ ఎండ‌ల వ‌ల్ల సముద్ర ఉష్ణోగ్ర‌త‌లు కూడా పెరిగాయి. దాంతో ఆక్సిజ‌న్ అంద‌క భారీగా చేప‌లు మృతి చెందాయి. అమెరికాలోని టెక్సాస్ గల్ఫ్ తీరానికి లక్షల సంఖ్యలో మెన్‌హడెన్ జాతికి చెందిన చేపలు కొట్టుకొచ్చాయి. తీరం వెంబడి ఎటు చూసినా చేపలు చనిపోయి తేలుతూ కనిపించాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా నీటి ఉష్ణోగ్రత 70 డిగ్రీల ఫారన్‌హీట్ కంటే ఎక్కువైతే మెన్‌హడెన్ లాంటి చేపలు మనుగడ సాగించలేవని క్వింటానా బీచ్ కౌంటీ పార్క్ అధికారులు వెల్లడించారు. మీరు నీటిని వేడి చేసినప్పుడు.. నీటిలోంచి ఆక్సిజన్ గాలిలోకి విడుదల అవుతుంది. టెక్సాస్‌లో అదే జరిగింది. ఇప్పుడు కనుచూపు మేరలో ఎటుచూసినా చనిపోయిన చేపలు ఉన్నాయి. ఇది ప్రారంభం మాత్రమే. ఇప్పటికైనా స్పందించాల‌ని క్లైమేట్ డిఫయన్స్ అనే యూజర్ తెలిపాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement