Monday, May 6, 2024

Jammu Kashmir : భారీ ఎన్ కౌంటర్… నలుగురు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్ లో ఈరోజు భారీ ఎన్ కౌంటర్ జరిగింది. కుప్వారాలోని మచల్​ సెక్టార్ లో గల నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) సమీపంలో పోలీసులు, ఆర్మీ అధికారులు ఈరోజు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. ఈ ఎన్ కౌంటర్ లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఆపరేషన్ లో నియంత్రణ రేఖ గుండా పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ నుంచి భారత్ లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న నలుగురు ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది గుర్తించి వారిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆ నలుగురు ఉగ్రవాదులు హతమైనట్లు కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement