Sunday, May 5, 2024

Encounter: జమ్ముకశ్మీర్‌లో మరో ఉగ్రవాది హతం

జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఆదివారం ఉదయం ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. శ్రీనగర్‌లోని బిషెంబర్ నగర్‌లో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో సీఆర్‌పీఎఫ్‌ బలగాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా బృందాలపై ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో వారికి ధీటుగా జవాన్లు జరిపిన కాల్పుల్లో ముష్కరుడు హతమయ్యాడు.

మరోవైపు ఇటీవల సిఆర్‌పిఎఫ్ సిబ్బందిపై జరిగిన దాడిలో పాల్గొన్న ఉగ్రవాది హతమయ్యాడని పోలీసులు తెలిపారు. ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు భద్రతా సిబ్బంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. కాగా, నిన్న రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించిన సంగతి తెలిసిందే.  

Advertisement

తాజా వార్తలు

Advertisement