Sunday, May 5, 2024

వివాదంలో హీరో సూర్య దంప‌తులు

త‌మిళ స్టార్ హీరో సూర్య ప్ర‌ధాన పాత్ర‌ని పోషించిన చిత్రం జై భీమ్. జ్ఞానవేల్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నటి, నిర్మాత జ్యోతిక నిర్మించారు. ఈ చిత్రం వివాదంలో చిక్కుకున్నారు సూర్య దంప‌తులు. ఈ సినిమాలో తమ కులాన్ని అవమానించారంటూ వన్నియార్ సామాజిక వర్గానికి చెందిన కొందరు 2021 లో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు తమ మనోభావాలను దెబ్బ తీశాయని, తమ కులాన్ని, వృత్తిని కించపర్చేలా కొన్ని వ్యాఖ్యలు ఉన్నాయని వారు పిటిషన్ లో తెలిపారు. ఈ కేసుపై తాజాగా చెన్నై కోర్టు విచారణ జరిపింది. ఇప్పటివరకు ఏ ఒక్క విచారణకు హీరో సూర్య, జ్యోతిక, డైరెక్టర్ జ్ఞానవేల్ రాజా హాజరుకాలేదని, దీంతో వారి పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. అంతేకాకుండా ఈ కేసుపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆ ముగ్గురును కోరింది. ఇక ఈ కేసు తదుపరి విచారణ ఈనెల 20కి వాయిదా వేసింది. జై భీమ్ .. అమెజాన్ ప్రైమ్ వీడియో లో రిలీజ్ అయ్యి సంచలన విజయం సాధించడమే కాకుండా ఆస్కార్ అవార్డులకు కూడా ఎన్నికైన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement