Sunday, May 5, 2024

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తా.. అవమానాలు భరించలేనన్న జగ్గారెడ్డి

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం దాదాపు ఖాయం అయింది. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి జగ్గారెడ్డి మూడు పేజీల లేఖ రాశారు. పార్టీ వీడిన గాంధీ కుటుంబంపై గౌరవంతో ఉంటానని అన్నారు. ఈ ప్రకటన విడుదల చేసిన నాటి నుండి తాను కాంగ్రెస్ గుంపులో ఉండనని చెప్పారు. త్వరలో పార్టీ పదవికి, కాంగ్రెస్ పార్టీ ప్రథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తానని వెల్లడించారు. కాంగ్రెస్ లో సడన్ గా వచ్చి లాబీయింగ్ చేసి పీసీసీ కావొచ్చు అని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు.

సొంత పార్టీలోనే కుట్రపూరితంగా కాంగ్రెస్ కోవర్టుగా ముద్రవేస్తున్నారని జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే కోవర్ట్ అని కొందరు యూట్యూబ్ చానెల్స్ ద్వారా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ లో గతంలో పార్టీలో వివాదాలు ఉన్న హుందాగా ఉండేది.. కానీ ఇప్పుడు ఆ హుందాతనం లేదన్నారు. కాంగ్రెస్ లో జరుగుతున్న అవమానాలు భరించలేకనే రాజీనామా చేసి ప్రజల్లో  స్వతంత్రంగా సేవ చేస్తానని ప్రకటించారు. పార్టీలో ఎవ్వరు కోవర్టులో అధిష్టానం గుర్తించాలన్నారు. 2017లో అధినేత రాహుల్ గాంధీ సభ పెట్టమంటే ఎవ్వరు సభ పెట్టడానికి ముందుకు రాకుంటే తాను సభ నిర్వహించానని గుర్తు చేశారు. ఆ సభ నుండి పార్టీ రాష్ట్రంలో బలపడిందన్నారు. పార్టీ కోసం కష్టపడింది నేనా కోవర్టుని ? సభను నిర్వహించకుండా మౌనంగా ఉన్న నేతల కోవర్టులు? అని ప్రశ్నించారు.

ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ నుండి ఎవ్వరు అభ్యర్థులు పెట్టకుంటే తాను మెదక్ జిల్లా నుండి అబ్యర్దిని పెట్టి…. కోట్లు ఖర్చు పెట్టి  పార్టీకి ఒక్క ఓటు తగ్గకుండా పార్టీ పరువు నిలిపానని గుర్తుచేశారు. పార్టీ సీనియర్లు ఎవ్వరు కనీసం అభ్యర్థిని పెట్టకుండా మౌనంగా ఉన్నారన్నారు. ఇటీవల హుజూరబాద్ ఉప ఎన్నికల్లో 40 వేల కాంగ్రెస్ ఓట్లను మూడువేల ఓట్లకు పరిమితం చేసిన వాళ్ళు కోవర్టలా? లేక నేనా ? అని నిలదీశారు. గాంధీ కుటుంబంపై బీజేపీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే ముందు ఖండించింది తానేనని చెప్పారు. పార్టీలో పదవులు అనుభవిస్తున్న వాళ్ళు ఎందుకు స్పందించకుండా మౌనంగా ఉన్నారని జగ్గారెడ్డి లేఖలో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement