Monday, April 29, 2024

తెలంగాణ‌లో తొలి ముస్లిం మ‌హిళా ‘ఐపీఎస్’ గా స‌లీమా – ఈమె కుటుంబం అంతా విద్యావంతులే

తెలంగాణ రాష్ట్రంలోనే తొలి ముస్లిం మ‌హిళా ఐపీఎస్ గా రికార్డుకెక్కింది షేక్ స‌లీమా. కేంద్రం విడుద‌ల చేసిన నాన్ కేడ‌ర్ ఐపీఎస్ ల ప‌దోన్న‌తి జాబితాలో ఆమెకు ఈ స్థానం ద‌క్క‌డం విశేషం. ఖ‌మ్మం జిల్లా చింత‌కాని మండ‌లం కోమ‌ట్ల గూడెంకు చెందిన లాల్ బ‌హ‌దూర్, యూకూబీ దంపతుల కుమారై స‌లీమా. కాగా ఆమె తండ్రి ఖమ్మంలో ఎస్సైగా ప‌ని చేసి రిటైర్ అయ్యారు. కాగా ఈమె కుటుంబమంతా విద్యావంతులే. సలీమాకు ఇద్దరు చెల్లెళ్లు, తమ్ముడు. ఒక సోదరి జరీనా ఇటీవల ఏపీలో గ్రూప్‌-1 పరీక్ష రాసి మెయిన్స్‌కు ఎంపికయ్యారు.

ఇంటర్వ్యూలో అర్హత సాధిస్తే ఆమె కూడా ప్రభుత్వ సర్వీసుకు ఎంపికవుతారు. మరో చెల్లెలు మున్నీ ఖైరతాబాద్‌ ఎంవీఐగా పనిచేస్తున్నారు. తమ్ముడు ఖాసిం హైదరాబాద్‌ కేర్‌ హాస్పిటల్‌లో డాక్టర్‌గా స్థిరపడ్డారు. సలీమా భర్త కూడా సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉన్నారు. సలీమా కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి బయో టెక్నాలజీలో ఎమ్మెస్సీ చేశారు. 2007లో గ్రూప్‌-1లో డీఎస్పీగా ఎంపికయ్యారు. ఆదిలాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌లో తొలి పోస్టింగ్‌ పొందిన ఆమె అంబర్‌పేట పీటీసీ వైస్‌ ప్రిన్సిపాల్‌గా, మాదాపూర్‌లో అదనపు కమిషనర్‌(అడ్మిన్‌)గా పనిచేసి ప్రస్తుతం రాచకొండ కమిషనరేట్‌లో డీసీపీగా ఉన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement