Monday, April 29, 2024

Air India: ఎంపీలు విమాన టికెట్లు కొనాల్సిందే..

దేశంలోని ఎంపీలకు ఉచిత విమాన టికెట్లు బంద్‌ అయ్యాయి. ఇప్పటివరకు ఎయిర్‌ ఇండియా ప్రభుత్వరంగ సంస్థగా ఉండటం వల్ల ఎంపీలకు ప్రొటోకాల్‌ అమలు చేసేవారు. అయితే, ఇప్పుడు ఎయిర్ ఇండియా ప్రైవేట్ పరం అయింది. టాటా గ్రూప్ ఇటీవల ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసింది. దీంతో ఇకపై ఎంపీలు డబ్బు పెట్టి విమాన టికెట్లు కొనాలని శుక్రవారం విడుదలైన రాజ్యసభ సచివాలయ బులెటిన్‌ సభ్యులకు సూచించింది.

గతంలో పార్లమెంటు సభ్యులకు వ్యక్తిగతంగా 34 విమాన టికెట్లు, వారి జీవిత భాగస్వామికి మరో 8 టికెట్లు ఉచితంగా ఇచ్చేవారు. వాటి కొనుగోలుకు పార్లమెంటు ఉభయసభల సచివాలయాలు ‘ఎక్స్ఛేంజ్‌ ఆర్డర్‌’ జారీ చేసేవి. ఆ ఉత్తర్వులు చూపి డబ్బు పెట్టకుండానే ఎంపీలు ఎయిర్‌ ఇండియా టికెట్లు కొనుగోలు చేయడానికి వీలుండేది. ఇప్పుడు ఆ విధానాన్ని రద్దు చేశారు. రాజ్యసభ, లోక్‌సభ సచివాలయాలు ఇప్పటికే జారీ చేసిన ఎక్స్ఛేంజ్‌ ఆర్డర్లను అనుసరించి టికెట్లు కొని ఉంటే అందుకు సంబంధించిన టీఏ క్లెయిమ్‌లు చేసుకునే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: Covid-19: రష్యాలో లాక్ డౌన్.. ఆంక్షలు కఠినం

Advertisement

తాజా వార్తలు

Advertisement