Friday, April 26, 2024

నేడు ఇండియా VS న్యూజిలాండ్ మూడో టీ20

టీమిండియా వర్సెస్ న్యూజీలాండ్ జట్ల మధ్య 3వ టీ20 మ్యాచ్ నేడు జరుగుతుంది. నేపియర్‌లోని మెక్‌లీన్ పార్క్‌ మైదానంలో మధ్యాహ్నం 12గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి మ్యాచ్ వర్షంకారణంగా రద్దుకాగా.. రెండో టీ20 మ్యాచ్‌లో ఇండియా విజయం సాధించింది. సిరీస్‌లో నేడు జరిగే చివరి మ్యాచ్‌లో సత్తాచాటి సిరీస్ ను కైవసం చేసుకోవాలని టీమిండియా కుర్రాళ్లు పట్టుదలతో ఉన్నారు. అయితే ఈరోజు జ‌రిగే మ్యాచ్ న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియ్స‌న్ డాక్ట‌ర్ అపాయింట్ మెంట్ కార‌ణంగా దూరం కానున్నారు. ఈ మ్యాచ్ కు టీమ్ సౌథీ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. అయితే ఈ సిరీస్ లో ఈరోజు మ్యాచ్ లోనైనా గెల‌వాల‌ని న్యూజిలాండ్ జ‌ట్టు ప్ర‌య‌త్నించ‌నుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement