Monday, April 29, 2024

India Corona: దేశంలో యాక్టివ్ కేసులు.. 242 రోజుల్లో ఇదే మొదటిసారి

దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 13,451 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,42,15,653కు చేరగా.. ఇందులో 3,35,97,339 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. అదే సమయం 14,021 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. మరో 585 మంది మృతిచెందారు. ఇప్పటి వరకు మొత్తం 4,55,653 మంది మహమ్మారికి బలయ్యారు. ప్రస్తుతం దేశంలో 1,62,661 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇంత తక్కువగా ఉండటం గత 242 రోజుల్లో ఇదే మొదటిసారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడింది.

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నది. నిన్న ఒక్కరోజే 55,89,124 మందికి వ్యాక్సిన్‌ పంపిణీ చేశారు. దీంతో మొత్తంగా 1,03,53,25,577 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

ఇది కూడా చదవండి: సామాన్యుడిని పెళ్లాడిన రాజకుమారి.. రాచ‌రిక‌పు హోదాకు దూరం!

Advertisement

తాజా వార్తలు

Advertisement