Wednesday, May 15, 2024

Corona: భార‌త్‌లో తగ్గిన కరోనా.. కొత్తగా 71 వేల కేసులు

భార‌త్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్త‌గా 71,365 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,24,10,976 కు చేరింది. క‌రోనాతో 1,217 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు క‌రోనాతో మరణించిన వారి సంఖ్య 5,05,279కి పెరిగింది.

గడిచిన 24 గంటల్లో 1,72,211 మంది బాధితులు కోలుకున్నారు. దేశంలో ఇప్పటివరకు మొత్తం 4,10,12,869 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారు. ప్ర‌స్తుతం దేశంలో 8,92,828 యాక్టివ్ కేసులు ఉన్నాయి. క‌రోనా రోజువారీ పాజిటివిటీ రేటు 4.54 శాతంగా ఉందని చెప్పింది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 170,87,06,705 డోసుల వ్యాక్సిన్లు వినియోగించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement