Monday, April 29, 2024

Covid-19: ఇండియాకు బిగ్ రిలీఫ్.. దేశంలో కొత్తగా ఎన్ని కేసులంటే?

ఇండియాలో కరోనా మహమ్మారి భారీగా తగ్గుతున్నాయి. గత కొన్ని రోజులుగా రోజూవారీ కరోనా కేసుల సంఖ్య చాలా తక్కువగా నమోదు కావడం ఊరట కలిగిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 6,915 కరోనా కేసులు కొత్తగా నమోదయ్యాయి. కరోనాతో మరో 180 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,14,023కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో 16, 864 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు.

ప్రస్తుతం దేశంలో 92,472 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు కోవిడ్ బారి నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,23,24,550 గా ఉంది. ఇప్పటి వరకు దేశంలో 177,70,25,914 వ్యాక్సిన్ డోసులను అందించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement