Thursday, April 25, 2024

Covid update: ఇండియాలో కొత్తగా 6561 కేసులు.. 142 మరణాలు

దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 6561 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,29,45,160కు చేరింది. అయితే, మహమ్మారి కారణంతో దేశంలో 142 మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 5,14,388కి చేరింది. ఇక దేశంలో ప్రస్తుతం 77,152 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 14,947 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 4,23,53,620కు పెరిగింది.  దేశం లో కరోనా పాజిటివిటి రేటు 96.92 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 1,78,02,63,222 కరోనా వ్యాక్సిన్లు డోసులు పంపిణీ చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement