Friday, May 3, 2024

దేశంలో కరోనా పడగ.. వరుసగా ఐదో రోజు 42 వేలపైగా కేసులు

దేశంలో కరోనా కేసులు మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. రోజువారి కొవిడ్​ కేసుల సంఖ్య వరుసగా ఐదు రోజూ 40 వేలకుపైగా నమోదైంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 42,909 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 380 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 4,38,210కు చేరింది. ఇప్పటి వరకు మొత్తం 3,19,23,405 మంది కరోనా నుంచి కోలుకోగా.. నిన్న 34,763 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 3,76,324 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 63.43 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది. దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో 29,836 కేసులు ఒక్క కేరళలోనే ఉన్నాయి. వైరస్ కారణంగా 75 మంది ప్రాణాలు కోల్పోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement