Friday, May 17, 2024

మూడో రోజుకు చేరిన బండి పాదయాత్ర.. ఈ రోజు ఇలా..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర మూడో రోజుకు చేరింది. బండి పాదయాత్ర పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతు ముందుకు సాగుతోంది. ఇవాళ్టి పాదయాత్ర తిప్పుఖాన్ బ్రిడ్జి, లంగర్ హౌస్ మీదుగా ఆరే మైసమ్మ గుడి వద్దకు చేరుకుంటుంది. అక్కడ సభను నిర్వహించిన తర్వాత లంచ్ బ్రేక్ ఉంటుంది. ఆ తర్వాత అజీజ్ నగర్ మీదుగా హిమాయత్ నగర్ వరకు సాగుతుంది. రాత్రి బండి సంజయ్ హిమాయత్ నగర్ లో బస చేస్తారు. ఈరోజు మొత్తం 13 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగనుంది.

కాగా, టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతోంది. ఈ నెల 28న పాదయాత్రను చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ వద్ద ప్రారంభించిన బండి సంజయ్… రెండో రోజున గోల్కొండ కోట దగ్గర బహిరంగసభను నిర్వహించారు. 2023 ఎన్నికల్లో గోల్కొండ కోటపై కాషాయ జెండాను ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement