Friday, May 10, 2024

India Corona: ఇండియాలో కొత్తగా 4,184 కేసులు.. మరణాలు ఎన్నంటే..

ఇండియాలో కరోనా కేసుల ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల సంఖ్య 5 వేల కంటే తక్కువగా నమోదవుతోంది. తాజా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన తాజా కరోనా బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేవంలో కొత్తగా 4,184 కేసులు నమోదు అయ్యాయి. 104 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 5,15,459కి చేరింది. ప్రస్తుతం 44,488 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇప్పటి వరకు 4,24,20,120 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,79,53,95,649 డోసుల వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement