Friday, April 19, 2024

దేశంలో 35 వేల కరోనా మందికి కరోనా..

దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 35,342 మందికి క‌రోనా వైర‌స్ బారిన పడ్డారు. దేశ‌వ్యాప్తంగా 38,740 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. అదే సమయంలో కరోనాతో 483 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 4,05,513గా ఉన్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు 3,12,93,062 మంది మహమ్మారి నుంచి కోలుకోగా.. వైర‌స్ తో మ‌ర‌ణించిన వారి మొత్తం సంఖ్య 4,19,470కి చేరింది. దేశంలో ఇప్పటివరకు 42,34,17,030 కరోనా టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ​ వెల్లడించింది. గురువారం ఒక్కరోజే 54,76,423 డోసులు అందించినట్లు తెలిపింది.

ఇది కూడా చదవండి: తెలంగాణలో 2.20 కోట్ల మందికి టీకా!

Advertisement

తాజా వార్తలు

Advertisement