Wednesday, April 24, 2024

Covid-19: దేశంలో కొత్తగా 2858 కరోనా కేసులు.. మరణాలు ఎంతంటే..

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు కరోనా కేసులు మూడు వేల దిగున నమోదు అయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన తాజా బులిటెన్ ప్రకారం.. దేశంలో కొత్తగా 2,858 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల 4,31,19,112కు చేరింది. ఇందులో 4,25,76,815 మంది బాధితులు కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు.

కరోనాతో 11 మంది మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 5,24,201కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో 3,355 మంది డిశ్చార్జీ అయ్యారు. మొత్తం కేసుల్లో 0.04 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. అలాగే, రికవరీ రేటు 98.74 శాతంగా ఉండగా.. రోజువారీ పాజిటివిటీ రేటు 0.59 శాతంగా ఉంది. ఇప్పటివరకు 1,91,15,90,370 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement