Sunday, April 28, 2024

దేశంలో 75 కోట్లు దాటిన వ్యాక్సిన్ల పంపిణీ

దేశంలో కొత్తగా 27,176 క‌రోనా కేసులు నమోదయ్యాయి. క‌రోనాతో మ‌రో 284 మంది మృతి చెందారు. దేశంలోనే అత్య‌ధికంగా కేరళలో 15,876 కొత్త‌ కేసులు న‌మోద‌య్యాయి. నిన్న 129 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,43,497కి పెరిగింది.  

దేశంలో క‌రోనా కేసుల సంఖ్య మొత్తం 3,33,16,755కి చేరింది. క‌రోనా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 3,25,22,171 మంది కోలుకున్నారు. అలాగే, నిన్న 38,012 మంది కోలుకున్నారు. ప్ర‌స్తుతం 3,51,087 యాక్టు కేసులున్నాయి. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 75,89,12,277 డోసుల వ్యాక్సిన్లు ప్రజలకు పంపిణీ చేశారు. నిన్న దేశంలో 61,15,690 వ్యాక్సిన్ వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement