Friday, May 3, 2024

దేశంలో భారీగా తగ్గిన కరోనా.. కొత్తగా 25 వేల కేసులు

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి.  ఆదివారం 32 వేల కేసులు నమోదవగా తాజాగా ఆ సంఖ్య 25 వేలకు చేరింది. గత 24 గంటల్లో కొత్తగా 25,072 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 389 మంది మరణించగా.. 44,157 మంది కరోనా​ నుంచి కోలుకున్నారు. దేశంలో ఇప్పటి వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,24,49,306కు చేరింది. ఇందులో 3,16,80,626 మంది బాధితులు కోలుకోగా..మొత్తం 4,34,756 మంది మహమ్మారికి బలయ్యారు. ప్రస్తుతం దేశంలో 3,33,924 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

కాగా, మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసుల సంఖ్య 1.2 శాతంగా ఉందని, రికవరీ రేటు 97.63 శాతానికి చేరిందని కేంద్రం పేర్కొంది. గతేడాది మార్చి తర్వాత యాక్టివ్‌ కేసులు భారీగా తగ్గాయని తెలపింది. ఇప్పటివరకు 58.25 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది. ఆదివారం ఒక్కరోజే 7,95,543 డోసులు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

ఇది కూడా చదవండిః బండి సంజయ్‌ పాదయాత్ర మరోసారి వాయిదా

Advertisement

తాజా వార్తలు

Advertisement