Thursday, April 25, 2024

బండి సంజయ్‌ పాదయాత్ర మరోసారి వాయిదా

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టనున్న పాదయాత్ర మరోసారి వాయిదా పడింది. ఈనెల 24 నుంచి బండి సంజయ్‌ తలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్ర వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. యూపీ మాజీ సీఎం కల్యాణ్‌సింగ్‌ మరణం వల్ల కార్యక్రమాలు రద్దు చేసుకున్నట్లు బండి సంజయ్‌ తెలిపారు. పార్టీ పరంగా ఆరు రోజులు సంతాప దినాలు పాటిస్తున్నట్లు పేర్కొన్నారు. నిజానికి సంజయ్ పాదయాత్ర ఆగస్ట్ 9న పాదయాత్ర  ప్రారంభంకావాల్సి ఉండగా కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర నేపథ్యంలో వాయిదా పడింది. అనంతరం ఆగస్టు 24న పాదయాత్ర ప్రారంభం అవుతుందని బిజెపి నేతలు ప్రకటించారు. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మ వారి ఆలయం నుండి హుజురాబాద్ వరకు పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. వేల మందితో పాదయాత్ర ప్రారంభానికి కాషాయపార్టీ ఏర్పాట్లు చేసుకుంది. అయితే ఇప్పుడు మరోసారి వాయిదా పడడం గమనార్హం. ఈ నెల 30 నుంచి పాదయాత్ర ప్రారంభించే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement