Thursday, May 2, 2024

India Corona: కరోనా గుడ్ న్యూస్.. 24 గంటల్లో 2,503 కేసులే

దేశంలో కరోనా మహమ్మారి కేసులు పూర్తిగా అదుపులోకి వస్తున్నాయి. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన కరోనా బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 2503 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  కరోనాతో మరో 27 మంది బాధితులు మరణించారు. 24 గంటల్లో దేశవ్యాప్తంగా 4,377 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

ప్రస్తుతం దేశంలో 36,168 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,29,93,494 కు చేరింది.  ఇందులో 4,24,41,449  బాధితులు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటివరకు  5,15,877  మంది బాధితులు మరణించారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,80,19,45,779 కరోనా వ్యాక్సిన్లు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement