Monday, April 29, 2024

COVID-19: 24 గంటల్లో 1260 కరోనా కేసులు.. మరణాలు ఎంతంటే..

దేశంలో కరోనా మహమ్మారి క్రమ క్రమంగా తగ్గుతోంది. నిన్నటితో పొల్చితే తాజా కేసులు తగ్గాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 1260 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో 83 మంది మరణించారు. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1404 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ప్రస్తుతం 13,445 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో కరోనా పాజిటివిటి రేటు 87.77 శాతంగా ఉంది. 

దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,30,27,035కు చేరింది. ఇందులో 4,24,92,326 కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. కరోనా మొత్తం 5,21,264 మంది మరణించారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,84,52,44,856 కరోనా వ్యాక్సిన్లు పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement