Friday, March 29, 2024

శుభకృత్ లో అంత శుభం జరగాలి: ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీష్

తెలుగు నూతన సంవత్సరాది శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా మంత్రి హరిశ్ రావు రాష్ట్ర  ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు నూతన సంవత్సరాన్ని ఆనందోత్సాహాలతో, సుఖసంతోషాల మధ్య అన్ని వర్గాల ప్రజలు జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ద్యేయంగా పనిచేస్తుందని, ఈ సంవత్సరం అన్నిరంగాల్లో పురోభివృద్ధిని సాదించాలని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందడం సంతృప్తినిచ్చిందని, ఈ ఏడు కాలంతో ప్రమేయం లేకుండా కాళేశ్వరం జలాలతో కాలువలు, చెరువులు, కుంటల్లో నీళ్లు సమృద్ధిగా నిండి ఉన్నాయని చెప్పారు. రైతులు ఆనందంతో పాడి పంటలతో వర్ధిల్లాలన్నారు. గత రెండు సంవత్సరాలు కరోనాతో పండగను వేడుక జరుపుకోలేక పోయామని, ఈ శుభకృత్ సంవత్సరంలో అన్ని పాలద్రోలి అన్నింటా అందరికి శుభం జరగాలని భగవంతుణ్ణి ప్రార్ధించారు. ఈ  కొత్త సంవత్సర పర్వదినం అందరి కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపాలని మంత్రి హరీశ్ రావు కోరుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement