Sunday, May 5, 2024

Inida Corona: దేశంలో తగ్గిన కరోనా.. పెరిగిన మరణాలు

దేశంలో క‌రోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్తగా 12,428 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. కరోనాతో 356 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 15,951 మంది వైరస్​ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దేశంలో ఇప్పటి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,42,02,202 కి చేరింది. ఇందులో 3,35,83,318 మంది కోలుకొని డిశ్చార్జ్‌ కాగా.. ప్రస్తుతం 1,63,816 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. దేశంలో ఇప్పటి వ‌ర‌కు మొత్తం 4,55,068 మంది క‌రోనాతో మృతి చెందారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,02,94,01,119కి చేరింది. సోమవారం ఒక్కరోజే 11,31,826 కరోనా​ పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్​ పేర్కొంది. 

ఇది కూడా చదవండి: వెహికిల్స్ పై కొరడా ఝళిపించిన పోలీసులు

Advertisement

తాజా వార్తలు

Advertisement